వైద్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం: వైద్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. రాజోలు జేమ్స్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఐశ్వర్యసాయి ఈ తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.