వ్యాపారిని బెదిరించి రూ.6లక్షల చోరీ

విజయవాడ:పాతబస్తీ రాయల్‌ హోటల్‌ సెంటర్‌లో ఓ బియ్యం వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది.నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వ్యాపారి కత్తులతో బెదిరించి రూ.6లక్షల నగదును దోచుకెళ్లారు.బాధితుడు ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.