శాంతినగర్ రవీంద్ర ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యార్థుల సమ్మేళనం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి);
జోగులమ్మ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీలో ఉన్న రవీంద్ర ఉన్నత పాఠశాల లో ఆదివారం 2004-05 వ సంవత్సరము 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు, రాధాకృష్ణమూర్తి ,గోపాల్ రావు ,బుచ్చన్న గార్లకు సన్మానం చేశారు. కమిటీ సభ్యులు బసవ పూర్ణయ్య,
రమేష్, ప్రభాకర్ లను సన్మానం చేశారు.ప్రస్తుతము పాఠశాల లో విద్యను బోధిస్తున్న కృష్ణ,కోమలి, దీప్తి ని సన్మానం చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు .కర్నూల్,గద్వాల, హైదరాబాద్,కామారెడ్డి ప్రాంతాలలో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువులకు సన్మానం చేసి వారితో ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా తమ తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు సంవత్సరములో ఏదో ఒక సందర్భంలో కలుసుకోవాలని తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని తీర్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 2004 – 05 విద్యార్థిని,విద్యార్థులు 100 మంది దాకా పాల్గొన్నారు.