శోకసంద్రంలో వెనిజులా

కరాకన్‌ : అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో కన్నుమూయడంతో వెనిజులా శోకసంద్రంలో మునిగింది. కరాకన్‌లోని సైనికాసుపత్రిలో నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు ఉపాధ్యక్షుడు నికోలన్‌ మదురో వెల్లిడించిన అనంతరం ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు కరాకన్‌కు చేరుకుంటున్నారు.