శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక శోభాయాత్ర…

73,116  రూపాయలకు పెద్ద లడ్డు కైవసం చేసుకున్న పంతం నర్సింహా

34,116  రూపాయల కు చిన్న లడ్డు ను కైవసం చేసుకున్న జెనిగే వెంకటేష్ యాదవ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండలం లోని నందివన పర్తి గ్రామంలో ని శీకృష్ణ యాదవ యూత్ అధ్యర్యం లో ఏర్పాటు చేసిన  బొజ్జ గణపయ్యను  శనివారం నిమజ్జనానికి తరలించారు.గణనాధుని మహానిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది. గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర ఘనంగా జరిగింది. అందంగా అలకరించిన  వాహనం లో గణనాథుడిని తరలించి  గ్రామంలో ని చెరువులో నిమజ్జనం చేశారు మహానిమజ్జనోత్సవాన్ని కన్నులారా చూసేందుకు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తరలివచ్చారు.దాంతో గ్రామ  పరిసరాలన్ని జనంతో కిక్కిరిసిపోయాయి.లంబోదరుడి లడ్డూ వేలం పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒకరిని మించి ఒకరు ‘తగ్గేదేలా’ అనే రేంజ్‌లో పోటీపడ్డారు. లడ్డు వేలంపాటలో పెద్ద లడ్డును 73,116 రూపాయల కు పంతం నర్సింహా యాదవ్ కైవసం చేసుకున్నారు, చిన్న లడ్డును 34,116 రూపాయలకు జెనిగే వెంకటేష్ యాదవ్ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న గణపతి లడ్డూ ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ మహా ప్రసాదం దక్కడం తమ అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Attachments area