శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు

జనంసాక్షి,మంథని, అక్టోబర్ 28 : మంథని మండలము, మంథని మున్సిపల్ పోచమ్మ వాడ, గోపాల్ పూర్, లక్కేపూర్, నాగారం గ్రామాల నుండి పలు పార్టీలో చెందిన యువకులు, మహిళలు సుమారు 200 మంది మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.