శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 31 : మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలములోని గుండారo గ్రామ మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిడుగు స్వామి, గొల్లపల్లి గ్రామ మాజీ బిఆర్ఎస్ అధ్యక్షులు గుమ్మడి చంద్రయ్య తో పాటు గుండారం గ్రామంలో వివిధ పార్టీల నుండి 100 మందికి పైగా యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బాపూజీ నగర్ కు చెందిన యువత 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఏఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ ఎంపీపీ కోలేటి మారుతి, మండల కన్వీనర్ ఎస్ఎస్ అన్వర్, గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు, జిల్లా కార్యదర్శి బొంపల్లి రాజయ్య, గుండారం గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్, కమాన్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీను తో పాటు అధిక సంఖ్యలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.