శ్రీలంకలో 56 మంది తమిళ జాలర్ల అరెస్టు

కొలబో/ రామేశ్వరం : అంతర్జాతీయ తీర జలాల్లోకి చొరబడ్డారంటూ శుక్ర, శనివారాల్లో మొత్తం 56 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని అధికారులు వెల్లడించారు. రామేశ్వరానికి చెందిన 30 మంది జాలర్లను అరెస్టు చేయడంతోపాటు వారి ఐదు మరపడవలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరిని భారత్‌ గతంలో శ్రీలంకకు ఇచ్చిన కచ్చతీవు ప్రాతంలో చేపలు పడుతుండగా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.