శ్రీవారికి జీవు విరాళం

తిరుమల,జూలై11(జనం సాక్షి): తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్‌ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవోరమేశ్‌ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ జానకి రామ్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆదివారం శ్రీవారిని 89,013 మంది భక్తులు దర్శించుకోగా 37,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.