శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఏర్పాట్లు పై సమావేశం
ఝరాసంగం జులై (జనంసాక్షి )శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఏర్పాట్లు పై సమావేశం నిర్వహించారు. సోమవారం కార్యాలయంలో సిబ్బంది అర్చకులతో ప్రత్యేక సమావేశం లో ఆలయ ఈవో శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ ఈనెల 29 నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుందని అన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆది, సోమ, అమావాస్య రోజులలో యజ్ఞ మంటపంలో మిగతా రోజులలో గర్భాలయంలో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా గర్భ గుడిలో లింగ దర్శనం ఆది, సోమ, అమావాస్యలలో ఉండదన్నారు. పాత ధరల పద్ధతిలోనే పూజా కార్యక్రమాల రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అమావాస్యకు ముందు చతుర్దశి రోజు భక్తులకు రాత్రి 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు వహించాలన్నారు. భక్తులు తమకు ఏమైనా సమస్యలు ఉంటే ఆలయ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఉప ప్రధాన అర్చకులు బసయ్య స్వామి, శివప్రసాద్ స్వామి, ముఖ్య అర్చకులు దిలీప్ కుమార్ జోషి, బసయ్య స్వామి, జూనియర్ అసిస్టెంట్ శివకుమార్ స్వామి, రికార్డ్ అసిస్టెంట్ వీరన్న, అర్చకులు వీరసంగయ్ స్వామి, సంగయ్య స్వామి, నాగయ్య స్వామి, హరికిషన్ జోషి, గుండప్ప, మల్లికార్జున్, గురు ప్రసాద్, సంతోష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
