శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం

వేములవాడ, అక్టోబర్ 28 (జనంసాక్షి): వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ శివకుమార్ బెలిదే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేష్ కుమారి, పల్లె ప్రవీణ్, పర్లపల్లి శేఖర్, తాళ్లపల్లి అంజయ్య, సృజన, మమత, ఆకునూరి సుధీర్, లింగాల సుధాకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.