శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణం కోసం 51వేల విరాళం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు సెప్టెంబర్ 13 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని యాలాల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణం కోసం తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 51వేల రూపాయల విరాళం అందజేశా రు.మంగళవారం పట్టణంలో ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో యాలాల మండల విశ్వకర్మ సంఘం సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణం అభివృద్ధి కోసం సహాయం చేయాలని కోరారు.దీంతో వెంటనే స్పందించిన చైర్మన్ తన వంతుగా 51 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సహాయం చేసే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా భక్తి భావాన్ని అలవర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యాలాల మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కమ్మరి శేఖర్ చారి, ప్రధాన కార్యదర్శి భాస్కర చారి, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి, నాయకులు బాలయ్య చారి (రిటైర్డ్ టీచర్), శ్రీనివాస చారి,యువనాయకులు దేవనూర్ వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు