శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో ముడుపు కట్టిన కొప్పుల ఈశ్వర్ అభిమానులు నాయకులు

ధర్మపురి ( జనం సాక్షి) బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో ధర్మపురి ఎమ్మెల్యేగా మరోసారి కొప్పుల ఈశ్వర్ సార్ భారీ మెజార్టీతో గెలవాలని, ఆలయంలో పూజలు నిర్వహించి ముడుపు కట్టిన కొప్పుల ఈశ్వర్ అభిమానులు నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరే విధంగా కృషిచేసిన అనేకమంది పేదలను ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అలాంటి వ్యక్తిని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరు ఆలోచించి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సీర్నేని మల్లేశం బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం సత్తన్న మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్ యశ్వంతపెట్ ఎంపీటీసీ ఉరిమట్ల లక్ష్మి బుచ్చన్న బిఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు పూర్ణచందర్, బుగ్గారం మాజీ సర్పంచ్ సుద్దాల శరత్ చందర్, బుగ్గారం మండల మాజీ యూత్ ఉపాధ్యక్షుడు చల్ల శివకృష్ణ, బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బిసగోని తిరుపతి, వార్డు సభ్యులు పొన్నం శంకర్, చెట్టు పెళ్లి లతా,ప్రభాకర్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బాల పెళ్లి లక్ష్మణ్,బుగ్గారం మండలం మాల సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్, సంఘం పెద్దనావేని రాగన్న, కొమురయ్య, పోలంపల్లి మల్లేశం, నందయ్య చారి, గంజి జగన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.