శ్రీ సాయి దత్త ఆశ్రమం లో గురు కృపా శిబిరం

మిర్యాలగూడ.జనం సాక్షి అంతర్జాతీయ శ్రీ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 4 ఆదివారం పట్టణంలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో గురు కృపా శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ విశిష్టత హారతుల ప్రాధాన్యతలను వివరిస్తారని ఆయన తెలిపారు 2024 జనవరి 26 27 28 తేదీల్లో షిరిడీలో ప్రపంచ తెలుగు సాయి భక్తుల సమ్మేళనం నిర్వహణలో భాగంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పట్టణం పరిసర ప్రాంతాల నుంచి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని ఆయన కోరారు.కార్యక్రమం లో సోమన్న. మట్టయ్య. జానకి రాముడు. బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.