సంక్షేమానికి చెరగని చిరునామా వైఎస్సార్…..

టేకుమట్ల.సెప్టెంబర్02(జనం సాక్షి)సంక్షేమానికి చెరగని చిరునామా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మండల యువజన కాంగ్రెస్ నాయకుడు వైనాల యశ్వంత్ అన్నారు.మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జిల్లా ప్రాంత ప్రజల గుండెల్లో ఇప్పటికీ శిరస్థాయిగా ఉన్నాయన్నారు, రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమే తన కుటుంబంగా భావించి రాష్ట్ర సంక్షేమం కోసం పరితపించ్చి బ్రతికిన మనిషి అని. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో పూర్తి రుణమాఫీ చేసి,ఉచిత విద్యుత్ అందించి,ఇందిరమ్మ ఇల్లు,ఫీజు రియంబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ,అనేక సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజలకు చేరువైన మరపురాని మహానేతని అన్నారు జిల్లాలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిలో బాగంగా భూపాలపల్లి నూతన నియోజకవర్గంగా ఏర్పాటు చేసి చేల్పూర్ జెన్కో పవర్ ప్లాంట్,దేవాదుల,కంతనపల్లి ప్రాజెక్ట్ లతో పాటు కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణం, రైతుల కొసం అనేక చెక్ డ్యామ్లు నిర్మించి అపర భగీరధుడుగా నిలిచిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కొయ్యల చిరంజీవి,రెడ్డి రాజుల రాజు,పెరుమాండ్ల రాజు,పెసరు విఘ్నేష్ పండుగ రమణ,కౌడగానీ అనిల్,బందెల శ్రావణ్,మహేష్,బందెల మనోజ్,కొలుగురి అనిల్,మచ్చ ప్రభాకర్,గోల్లేపల్లి సురేష్, నవీన్,వలస సాయిరాంతది తరులు పాల్గొన్నారు.