సదాశివపేటలో సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వెల్టూర్ కు చెందిన కవితకు రూ 35,500, వినయ్ కి రు 60,000 చొప్పున మంజూరైన సీఎం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం సహాయ నిధి వల్ల పేదలకు మంచి వైద్యం అందే అవకాశం కలుగుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.