సమగ్ర సర్వే తరవాత కూడా ట్రైబ్యునళ్ల కొనసాగింపు

భూహక్కుసర్వేపై సిఎం జగన్‌ సవిూక్ష
అమరావతి,అగస్టు2(జ‌నంసాక్షి): జగనన్న భూరక్ష హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగనున్నట్లు సిఎం జగగన్‌ వెల్లడిరచారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ వివాదాల పరిష్కారం కోసం సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సవిూక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సవిూర్‌ శర్మ, ఉన్నతాధి కారులు హాజరయ్యారు. ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన ఈ ట్రైబ్యునల్‌ పనిచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అధికారులకు వెల్లడిరచారు. మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలని, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆకాంక్షించారు.