సరితమ్మ ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

గద్వాల పట్టణంలోని హరిత హోటల్ నందు గద్వాల నియోజకవర్గ స్థాయి క్రైస్తవ మత పెద్దలు పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనకు కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ పాల్గొన్నారు.. క్రైస్తవ పాస్టర్ల సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చడానికి కృషి చేస్తామని సరితమ్మ అన్నారు… రానున్న ఎన్నికలలో ఆశీర్వదించాలని పాస్టర్లను సరితమ్మ అభ్యర్థించారు..అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆశీర్వదించి ఈ సారి గద్వాల ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని హామీ ఇచ్చారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు గంజిపేట్ శంకరన్న, గంజిపేట్ తిమ్మన్న,జమ్మిచేడు ఆనంద్,శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, నాగేంద్ర యాదవ్, భాస్కర్ యాదవ్, నాగరాజు, ఏకే వెంకటన్న,తిమోతి, పాస్టర్లు నేహమియ,నాగరాజు, బాలస్వామి,ఏసన్న,రవీంద్ర, రుబేన్,ఆనందరావు, యువరాజు, శ్యాసన్,ఏసన్న,ఆశోక్ తదితరులు ఉన్నారు