సర్వోదయ సంకల్ప శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న చౌడాపూర్ మండల నాయకులు

చౌడాపూర్ సెప్టెంబర్ 2(జనం సాక్షి): రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్వోదయ సంకల్ప శిబిరం కార్యక్రమం గురువారం మరియు శుక్రవారం రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్ర పరిధిలో మూర్తజు గూడా లో నిర్వహించిన కార్యక్రమంలో చౌడపూర్ మరియు కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, చౌడపూర్ మండల పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ మరియు ఆంజనేయులు,కుల్కచర్ల మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్,అడవి వెంకటపురం ఎంపిటిసి సంగీత, చౌడపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, రాము,వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.