సహచరుడి కుటుంబానికి సంఘీభావం

మండలంలోని బొడ్లాడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన తమ సహచరుడు రాపాక వెంకన్న కుటుంబానికి సంఘీభావంగా శనివారం  శ్రీ సీతారాముల పౌరాణిక భజన భక్త మండలి ఆధ్వర్యంలో ఒక క్వింటా బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వెంకన్న కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు రాపాక అశోక్,ఉమేష్, మల్లయ్య లతో పాటు గ్రామ అధ్యక్షుడు గువ్వ రామానుజo, ఎర్రం సత్తయ్య,బొడ్డుపెల్లి వెంకన్న, రాపాక వీరాంజనేయులు, జనిగల శంకర్, కొత్తపెల్లి అంజయ్య,తెప్ప వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.