సాయి చంద్ ఫై దాడి హేయమైన చర్య. మాల మహా నాడు జిల్లా నాయకులు తైలి శ్రీనివాసులు.

అలంపూర్ లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కు హాజరైన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మెన్ సాయి చంద్ ఫై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అతని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జిల్లా నాయకులు తైలి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి చంద్ ప్రొ టో కాల్ ప్రకారం రాష్టం లో ఎక్కడైనా పాల్గొనే అధికారం వుందని కానీ ఎమ్మెల్యే ఉద్దేశ పూర్వకంగా నే తనయుడి తో దాడి చేయించారని,ఇది సరైనది కాదని అన్నారు. ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు ఫై హత్యా యత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కేసీఅర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే అబ్రహం ఫై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాయి చంద్ కు మాలల సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేతలు మల్లికార్జున్, చంటీ,వెంకటయ్య , తిరుపతయ్య, రాములు, పాండు పాల్గొన్నారు.