సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం

మనిగిల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం

మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి

వనపర్తి బ్యూరో అక్టోబర్ 31 (జనంసాక్షి)

బిఆర్ ఎస్ అభ్యర్థి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి వనపర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి , కూతురు తేజస్విని గ్రామ ప్రజలను కోరారు. మంగళవారం పెద్ద మందడి మండలం మనిగిల్ల గ్రామంలో వారు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టం చేసి ప్రజలకు చేరువలో ఉన్న నాయకుడిని ప్రజలు విస్మరించరని అందుకు నిదర్శనం 2018 ఎన్నికలు అని వనపర్తి చరిత్రలోనే అత్యధిక మెజారిటీ ని ఇవ్వడం జరిగింది వారు గుర్తు చేశారు. ప్రజలు ఎంత మెజారిటీ ని ఇచ్చారో అంతే వేగంగా అభివృద్ధి చేసి చూపించాడని మరొకసారి ఆశీర్వదించి భారీ మెజారిటీని అందిస్తే మరింత అభివృద్ధి కి అనుక్షణం మంత్రి నిరంజన్ రెడ్డి పని చేస్తారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మధులత, అక్కల జ్యోతి, అనురాధ,
సాయి లీల, కొమ్ము లక్ష్మీ తదితర మహిళ నాయకురాలు, నాయకులు శ్రీనివాస్ గౌడ్ , మోహన్ , సూర్యవశం గిరి, శివ తదితరులు పాల్గొన్నారు