సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు

మండల పరిధిలో గలబహదూర్ గూడెం, బండపల్లి,జమ్మాపూర్, తెల్ల రాళ్లపల్లి,శాఖాపూర్,మాధవరావుపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, సింగిల్ విండో వైస్ డైరెక్టర్ బాలయ్య, ప్రారంభించారు..రైతులు పండించిన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు.రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందన్నారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమనాథ్ నాయక్, సర్పంచులు రాజేశ్వరమ్మ , విష్ణు, చెన్నమ్మ, మౌనిక తిరుపతయ్య, రేణమ్మ. బి సునీత,సీఈఓ భాస్కర్ గౌడ్, ఎంపీటీసీ ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పిటిసి రామ్మూర్తి నాయుడు,సింగిల్ విండో డైరెక్టర్లు,గ్రామాల ప్రజా ప్రతినిధులు,విండో సిబ్బంది,నాయకులు పాల్గొన్నారు.