సిఎం పర్యటన నేపథ్యంలో జనసేన నేతల అరెస్ట్‌

రాజమండ్రి,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్డు కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను అరెస్టు చేపట్టారు. జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీఇప్పటికే పిలుపునిచ్చింది. దీంతో జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా వరద బాధితులకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ముఖ్యమంత్రికి పార్టీ తరుపున వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే నిరసనకు దిగుతామని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.