సిపిఎం నాయకుల ముందస్తు అరెస్ట్

తరిగొప్పుల( జనం సాక్షి )జూన్ 1: తరిగొప్పుల మండలంలో సిపిఎం నాయకులను  హనుమకొండ జిల్లాలలో  జరుగు ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
*వరంగల్ హన్మకొండ జిల్లాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వాలని CPM హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపు ఇవ్వగా  మహా ధర్నా కు ముఖ్య అతిథిగా వస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ గార్లను రాయపర్తి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి అనంతరం జనగామ జిల్లాలోని పాలకుర్తి  పోలీస్ స్టేషన్ కు తరలించడం ప్రభుత్వ పిరికిపంద చర్యలకు నిదర్శనమని జిల్లాలో  రాష్ట్రంలో ఎటువంటి జనసామికరణ పోరాటాలు లేకున్నా జిల్లాలోని ప్రతి మండలంలో   సిపిఎం పార్టీ నాయకత్వ  శ్రేణులను అరెస్టు చేయడాన్ని సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. తరిగొప్పుల మండలంలో అరెస్టు అయిన వారిలో సిపిఎం మండల నాయకులు పాండ్యల అంజయ్య, పెద్ద అంజయ్య,కనకయ్య,గుంటి సంపత్ తదితరులు ఉన్నారు.