సిబియస్ ఫలితాల్లో సరస్వతి స్కూల్ విద్యార్థుల హవా

ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి)
శుక్రవారం వెలువడిన సిబిఎస్ పదవ తరగతి ఫలితాల్లో మండలం పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న సరస్వతి స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా సరస్వతి స్కూల్ విద్యార్థులు 96 శాతం తో పాఠశాల టాపర్ గా స్పందన, జీవన సాగర్ లు, రవళి రాంబాబు లు 95 శాతం, 90 శాతనికి పైగా 11మంది విద్యార్థులు, 47 మంది విద్యార్థులు 70 శాతంకు పైగా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.