సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్ధిని పోలిమెరలు దాటిస్తాం

సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్ధిని పోలిమెరలు దాటిస్తాం

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 30. (జనంసాక్షి). స్థానికేతరురాలైన సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి అభ్యర్ధిని సిరిసిల్ల పొరుమేరు దాటిస్తామని బిజెపి నాయకులు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి, యువమోర్చా నుంచి సిరిసిల్ల నియోజకవర్గనికి సంబంధించిన పలువురు నాయకులు మూకుమ్మడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అన్నల్దాస్ వేణుతో పాటు పలు నాయకులు మాట్లాడుతూ బిజెపి జిల్లా రాష్ట్ర జాతీయ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఆకుల విజయతోపాటు మల్లు గారి నర్సాగౌడ్ ను బిజెపి నాయకుల కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండానే పోటీలో ఉంచారని అన్నారు. ఇప్పుడు కూడా వలస తీసుకొచ్చి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా నియామకం చేయదాన్ని తీవ్రంగా ఖండించారు. కనీసం స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండానే రాణి రుద్రమను సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంపై సహకరించబోమని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం పొలిమేరలు దాటిస్తామని హెచ్చరించారు. మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అన్నల్దాస్ వేణు, బూర విష్ణు ప్రసాద్, సురువు వెంకట్, భాస్కర్క,కంసాల మల్లేశం పలువురు నాయకులు ఉన్నారు