సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం.

సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 4. (జనంసాక్షి). కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మూడో వార్డులో ఆరు పథకాలపై విస్తృతంగా ప్రచారo నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాముని నల్లికాంత్, వెలుమల తిరుపతిరెడ్డి, వైద్య శివ ప్రసాద్, గోలి వెంకటరమణ, మ్యన ప్రసాద్, యేల్లే లక్ష్మీనారాయణ, గోనె ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు