సిసి రోడ్లు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని తీర్ణాంపల్లి గ్రామంలో గురువారం
జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ గ్రామ సర్పంచ్ సాలెయ్య తో కలిసి
నూతన సి.సి.రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభిం చారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు.గ్రామంలో ఏమైనా సమస్య లు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, మారెడుమాన్ దిన్నె మాజీ సర్పంచ్ వి.అరవింద్ ,చంద్రబండా తండా గ్రామ సర్పంచ్ రాంలాల్ నాయక్, టిఆర్ఎస్ మండల నాయకులు చంద్రయ్య యాదవ్,అమృనాయక్, లింగస్వామి,రాజు, కుర్మయ్య, మరియు గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.