సీఎంలు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ప్రారంభం..

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం, సీఎంల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు ప్రారంభోపన్యాసం చేశారు.న్యాయస్థానాలకు ప్రాథమిక వసతుల కల్పన, ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం లభ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.