సీఎం సహాయ నిది నిరుపేదలకు వరం

మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా నాయక్
గరిడేపల్లి, నవంబర్ 17(జనం  సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు. గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుండి మంజూరైన మోత్కూరి వెంకటేశ్వర్లు 50000 రావుల జ్యోతి 22000 రూపాయల చెక్కులను గురువారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రతిక్షణం నేనున్నా అంటూ పేద ప్రజల అవసరాలు తీరుస్తున్న శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై పనిచేయాలని దేశవ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాధారణ పొందుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన హాస్పటల్లో చేరి సీఎం సహాయ నిధికి వినియోగించుకోవాలని వారు అన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మాజీ జడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాని సైదులు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కడప ఇషాక్, ఎస్టీ సెల్ నాయకులు సందీప్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నెం రామ్ రెడ్డి, బొంత వెంకట్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కానుగు నగేష్, బూడిగే లాజర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు