సెప్టెంబర్ 13 న ఉపాధ్యాయుల చలో అసెంబ్లీని విజయవంతం చేయండి

. టీఎస్ యుటిఎఫ్ జనగామ జిల్లా కార్యదర్శి. మడూరి వెంకటేష్
బచ్చన్నపేట సెప్టెంబర్ 11 (జనం సాక్ష) యు ఎస్ పి సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపుమేరకు సెప్టెంబర్ 13న జరగబోయే చలో అసెంబ్లీ ని విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ జనగామ జిల్లా కార్యదర్శి మడురి వెంకటేష్ పిలుపునిచ్చారు ఆదివారం మండల అధ్యక్షులు మాడిశెట్టి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయుల బదిలీలు. పదోన్నతులు. 317 బాధితులకు న్యాయం. విద్యా వాలంటీర్లు. పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి హైదరాబాద్ ధర్నా చౌక్ నందు నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు పోలీసుల అనుమతి ఇవ్వలేదన్నారు. రోజుకు 50 మందితో శాంతియుతంగా చేసే నిరాహారదీక్షకులకు అనుమతి ఇవ్వని పోలీసుల నిరంకుశ వైఖరిని యు ఎస్ పి సి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అందుకు నిరసనగా మరియు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 13 జరగబోయే చలో అసెంబ్లీని విజయవాడలో చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి కనకయ్య. భేతి శ్రీధర్ గొట్టే కనకయ్య తదితరులు పాల్గొన్నారు