సెప్టెంబర్ 3న మెగా రక్తదాన శిబిరం

మోత్కూరు ఆగస్టు 29 జనంసాక్షి : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ యుపిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి వెంకటాచారి తెలిపారు. సోమవారం మోత్కూరులో కరపత్రాలను ఆవిష్కరించిమాట్లాడారు.మండల కేంద్రంలోని జొన్నల లింగయ్య పెట్రోల్ బంక్ ఆవరణలో నిర్వహించే రక్తదాన శిబిరానికి యువకులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరారు . కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు తొర్ర ఉప్పలయ్య , రెడ్ క్రాస్ సొసైటీ మండల ఉపాధ్యక్షులు అనిల్ చేపూరి, జిల్లా కమిటీ సభ్యులు గుండు ప్రసాద్ ,ఉపాధ్యాయులు దర్శనం వెంకన్న ,పులిగిల్ల నర్సయ్య,రాచూరి సోమయ్య ,దోర్నం వెంకన్న, దడిపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.