సేవా నేత్రం ఫౌండేషన్ పుష్పగిరి కంటి వారి సౌజన్యంతో

శ్రీ సాయి ఆర్టికల్స్ షాప్ ను గట్టులో ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమెహన్ రెడ్డి
గట్టు జున్23(జనంసాక్షి)
 గద్వాల నియోజకవర్గం లో గట్టు మండలం కేంద్రంలోని  సేవా నేత్రం ఫౌండేషన్ పుష్పగిరి కంటి వారి సౌజన్యంతో శ్రీ సాయి ఆర్టికల్స్ షాప్ ను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గురువారం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ
ప్రస్తుతం మొబైల్ ఫోన్, కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల గాలిలోని రేడియేషన్ వల్ల చాలా మందికి కంటి సమస్యలు రావడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి కంటిలో శుక్లాలు లో ఇబ్బందులను ఏం జరుగుతుంది వారికి ఈ సేవ నేత్రం ఫౌండేషన్ పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి కంటి పరీక్షలు నిర్థారణ చేస్తారు
 అదే విధంగా వారంలో ఒకరోజు గ్రామంలో ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి  ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందజేయడం జరుగుతుంది కావున గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్ జెడ్ పి టి సి రాజశేఖర్ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, మండలం పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కె.టి దొడ్డి మండలం పార్టీ అద్యక్షడు ఉరుకుందు, తెరాస పార్టీ నాయకులు బుదేప్ప బజారి,రాము,బలిగేరా కిష్టప్ప,జయన్న, వీరారెడ్డి,జి గోవిందు,కంగార్ తిమ్మప్ప, నవీన్ చారి,కట్టెల నర్సింహులు,నవీన్ చారి,వీరన్న, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.