సోమశిల కృష్ణానదిలో మాజీ మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై27(జనంసాక్షి):
భారీగా కురుస్తున్న వర్షాల మూలంగా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా నదిలో పరవళ్ళు తొక్కుతూ తరలివస్తున్న కృష్ణమ్మ తల్లికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం గ్రామ ప్రజలు రైతులు మరియు ప్రధాన అనుచరులతో కలిసి సోమశిల పుష్కర ఘాట్ దగ్గర పూలు చల్లి టెంకాయకొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లలితాసోమేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గ రైతులు పంటలు పండించుకునేందుకు పుష్కలంగా నీరు తరలివచ్చిందని ముందుగానే కేఎల్ఐ రిజర్వాయర్ ధ్వరా నీటి నిల్వ చేసుకొని సుభిక్షంగా పంటలు పండించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.అంతకు ముందు జూపల్లి కొల్లాపూర్ నుంచి కార్యకర్తలతో కలిసి బైక్ పై ర్యాలీగా సోమశిల చేరుకున్నారు.