సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కీర్తిరెడ్డి

చిట్యాల నవంబర్ 26 (జనంసాక్షి) సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసేందుకు వస్తున్న మీఆడబిడ్డ గా ఆశీర్వదించి, అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రామచంద్రాపురం ,చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులేనని, ఆడబిడ్డగా మీ ఇంటి ముందుకు వస్తున్నాను భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఈసారి రాష్ట్ర ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రాబందుల పాలనను అంతం చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు . రైతులకు అండగా బిజెపి ఉంటుంది. ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే వడ్లకు మద్దతు ధరగా 3100 చేస్తామని, ఉచిత విద్యా వైద్యం బిజెపితోనే సాధ్యమని, ఉజ్వల యోజన పథకం కింద సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు , ఇంట్లో ఉన్న వృద్ధులకు ఇద్దరికీ పింఛన్ ఇస్తామని బిజెపి మేనిఫెస్టో లోని పథకాలను వివరించారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర నాయకులు నాగపురి రాజమౌళి, మోర్తల రాజేందర్ , మాచర్ల రఘు, గొర్రె శశి కుమార్, మైదం శ్రీకాంత్, శ్రీనివాస్ శ్రీ పెళ్లి అనిల్ ,ఉడుత వనక్క,బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, కామిడీ నారాయణరెడ్డి, గుండ సురేష్ ,గజనాల రవీందర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు