స్కూలు భవనంపై నుంచి దూకిన బాలుడు

మహబూబ్‌నగర్‌,జూలై28(జ‌నం సాక్షి ): స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలుడు స్కూల్‌ బిల్డింగ్‌ నుంచి దూకాడు. తల్లిదండ్రలుఉ బలవంతంగా స్కూలులో దింపి రాగానే భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటన జిల్లాలోని జడ్చెర్లలో చోటు చేసుకున్నది. సెయింట్‌ పాల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థి సంతోష్‌ స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక స్కూల్‌ బిల్డింగ్‌ పైకి ఎక్కి కిందికి దూకాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తల్లిదండ్రలుఉల కన్నీరుమున్నీరయ్యారు.

నీటితొట్టెలో పడి బాలుడు మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని కురవి మండలం కొత్తూరు(జి) శివారు తాట్యతండాలో చోటు చేసుకున్నది. మాలోతు యశ్వంత్‌ అనే 18 నెలల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రలు దుఃఖానికి అవధుల్లేకుండా పోయాయి.