స్టాలిన్ను అరెస్టు చేసిన పోలీసులు
ఆందోళన సమయంలో స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ఇంతవరకూ నిందితులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి, డీజీపీ రాజేంద్రన్ వెంటనే రాజీనామా చెయ్యాలి’ అని స్టాలిన్ డిమాండ్ చేశారు.
స్టెరిలైట్ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా తమిళనాడులోని తూత్తుకుడిలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆందోళనల దృష్ట్యా కర్మాగారానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయాల్సిందిగా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది.