హత్య కేసు నిందితుడి అరెస్ట్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులో వృద్ధురాలిని హత్య చేసిన కమలాపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్‌ షారూక్‌ను అరెస్ట్‌ చేశామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మంగళవారం వెల్లడిరచారు. ఇదే మండలం మిట్టపల్లి వాసి నర్సవ్వను హత్య చేసి, ఆమె వద్దనున్న నగదును దోచుకుని పారిపోయాడు. అయితే పోలీసు బృందం నిందితుడి ఆచూకీ కనుగొని మంగళవారం అరెస్ట్‌ చేశారు.