హన్మకొండ బస్టాండ్ లో ఉద్రిక్తత

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల ద్వారా చేరవేస్తుండగా ఆర్టీసీ సిబ్బందికి ప్రైవేట్ డ్రైవర్లకు మధ్య తోపులాట జరిగింది. ఓ ప్రైవేట్ డ్రైవర్‌పై ఆర్టీసీ కార్మికుడు చేయి చేసుకున్నాడు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి బస్టాండ్ వద్ద ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. భారీగా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను ఏర్పాటు చేశారు.