హమాలీ కార్మికుడి ఆత్మహత్య

భూపాలపల్లి : మండలంలోని గడిగాని గ్రామానికి చెందిన కల్లూరు స్వామి 40 అనే హమాలీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే స్వామి ఆత్మహత్య చేసుకున్నట్లు భూపాలపల్లి సీఐ ఆది నారాయణ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.