హరితహారంపై నేడు వర్క్‌షాప్‌

వరంగల్‌,జూలై22(జ‌నంసాక్షి):  ఈ నెల 23 మంగళవారం ఉదయం10 గంటలకు హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌ లో తెలంగాణాకు హరితహారం అమలుపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఓరియెంటెషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపిపిలు,జెడ్పీటిసిలు,ఎంపిటిసిలు,మండల స్పెషల్‌ ఆఫీసర్లు, సర్పంచులు, గ్రామ పంచాయతీ  కార్యదర్శులు,గ్రామ నోడల్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ విలేజ్‌ నోడల్‌ ఆఫీసర్లు తమ పరిధిలో హరితహారం అమలుకు రూపొందించిన మైక్రో లెవల్‌ ప్రణాళికలు, అందుబాటులో ఉన్న నర్సరీలలో ఉన్న మొక్కలు ,లేబర్‌ బడ్జెట్‌ వివరాలతో సకాలంలో ఓరియెంటెషన్‌ కు హాజరు కావాలని కోరారు.