హలో బహుజన చలో హన్మకొండ

26న జరిగే భారీ బహిరంగ  సభను
 విజయవంతం చేయండి
 – బిఎస్పి జిల్లా ఉపాధ్యక్షలు తగరం  నాగన్న
కురవి జూన్ -24
(జనంసాక్షి న్యూస్)
కురవి మండలం నేరడ గ్రామంలో శుక్రవారం బిఎస్పి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షలు తగరం నాగన్న ఆధ్వర్యంలో జూన్ 26 తేదీన జరిగే బహిరంగ సభ  సన్నాహక కార్యక్రమం నిర్వహించి గోడపత్రిక ఆవిష్కరణ చేసారు.ఈ సందర్బంగా తగరం నాగన్న మాట్లాడుతూ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర రథసారధి సారథ్యంలో మూడు వందల 300రోజుల యాత్రలో భాగంగా 100 రోజుల యాత్ర ముగింపు  బహిరంగ సభ హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది.కావున బహుజనులు రాజ్యాధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీలు,అగ్రకుల పేదలు వేల సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బహుజనులకు విద్య, వైద్యం,ఉపాధి అవకాశాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు.బహుజనులు బాగుపడాలంటే బిఎస్పి అధికారంలోకి రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేరడ గ్రామ సెక్టార్ కమిటీ కన్వీనర్ నీరుడు అజయ్ చంద్ర,కిరణ్ శాంతమ్మ,,రావేల, సువార్త, ఉపేంద్ర,వంశీ, సుధీర్, నవ్య, చిలకమ్మా,ఉప్పలయ్య, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.