హోదాపై టీ ఎంపీల‌ను చూసి నేర్చుకోండి: ప‌వ‌న్ ట్వీట్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌త్యేక హోదాపై మాట్లాడారు. పార్ల‌మెంటులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై పోరాడిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలును ప‌వ‌న్ అభినందించారు. ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు మౌనం వ‌హించడాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఏపీ ప్ర‌త్యేక‌హోదాపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో తెలుగుదేశం ఎంపీలు స‌భ‌లో లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం అని ఆయ‌న అన్నారు. స్పెష‌ల్ స్టేట‌స్ కోసం పార్ల‌మెంట్ వేదిక‌గా వైసీపీ పోరాటం అభినంద‌నీయం అన్నారు.