*100 రోజుల భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం-బిఎస్పీ.*

*నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.*
నాగర్ కర్నూల్ రూరల్:జూన్ 23(జనంసాక్షి)
ఈ సమావేశంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ మాట్లాడుతూ,డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణలో గ్రామా గ్రామాన బిఎస్పీ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు.దాదాపు 100రోజులుగా,బిఎస్పీ రాష్ట్ర రథ సారథి బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తూ ప్రజల కష్టాలు,బాధలు తెలుసు కుంటున్నారని అన్నారు.యాత్ర 100రోజులకు చేరిన సందర్బంగా ఈ నెల 26వ తేదీన వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 70ఎమ్మెల్యే టికెట్స్ బిఎస్పీ పార్టీ కేటాయిస్తున్న విషయాన్ని పార్టీ కార్యకర్తలు గడప గడపకు తెలియజేప్పలన్నారు.ఎన్నో ఏండ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల సంపదను దోచుకొని,దాచుకుంటున్నాయని విమర్శించారు.తెరాస పాలనాలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి,ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని కెసిఆర్ దిగజార్చారని విమర్శించారు.అందుకే దోపిడీ పాలనా అంతం కావడానికి డా.ఆర్ఎస్పీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనీ ప్రజలను కోరారు.వరంగల్ లో జరిగే బహుజన రాజ్యాధికార యాత్ర 100రోజుల భారీ బహిరంగ సభకు విద్యార్థి,కార్మిక,కర్షక,నేతన్న,ఉద్యమకారులు,మేధావులు,బిఎస్పీ శ్రేణులు పెద్దఎత్తున్న స్వచ్ఛందంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్,ప్రధాన కార్యదర్శి కూసునూర్ శ్రీను,మండల కన్వీనర్లు శేఖర్,బండి.చెన్నయ్య,శివశంకర్,లక్ష్మణ్,మహేష్,బాలరాజు,బిఎస్పీ నాయకులు నిరంజనమ్మ,బుచ్చమ్మ,బీమమ్మ,కాశమ్మ,బాలనాగులు,వీరాస్వామి,రాముడు,మహేష్,రాంబాబు,వెంకటేష్,శంకర్,శివరాజ్,కురుమూర్తిలు పాల్గొన్నారు