విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. స్వరూపరాణి తెలిపారు. గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం అవగాహనపై జిల్లాస్థాయి సదస్సును నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ప్రతి మండలంలోను మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలతో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు, కళాజాతాల ద్వారా విస్త్రత ప్రచారం చేపట్టామన్నారు. జిల్లాకు చెందిన 21 ప్రాజెక్ట్ల పరిధిలోగల కిశోర బాలికలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్వాడి సూపర్ వైజర్లు అవగాహన సదస్సును నిర్వహించి పౌష్టికాహారలోపం, కిశోర బాలికల సమస్యలు, బాల్యవివాహాలు సంబందిత చట్టాలపై సదస్సులో అవగాహన కల్పించనన్నట్లు తెలిపారు. సదస్సును జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సదస్సులో పాల్గొననున్నట్లు స్వరూపరాణి తెలిపారు.
తాజావార్తలు
- ఎండు గంజాయి పట్టివేత
- గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్
- జనంసాక్షి 🔥🔥ప్లాస్ ఫ్లాష్ 🔥🔥
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ లో స్కైవాక్ లిఫ్ట్లో సాంకేతిక లోపం.. గంటలపాటు బందీగా యువకుడు
- ఉప్పల్ భగాయత్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
- ఉప్పల్లో మోదీ పాలన 4399 రోజుల సంబరాలు
- ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొన్న బైక్: ఇద్దరికి తీవ్ర గా యాలు
- ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్లో లోకాయుక్త నిజనిర్ధారణ కమిషన్ విస్తృత పర్యటన
- కాంగ్రెస్ నేతలకు దృష్టి, వినికిడి పరీక్షలు అవసరం
- మరిన్ని వార్తలు



