విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. స్వరూపరాణి తెలిపారు. గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం అవగాహనపై జిల్లాస్థాయి సదస్సును నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ప్రతి మండలంలోను మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలతో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు, కళాజాతాల ద్వారా విస్త్రత ప్రచారం చేపట్టామన్నారు. జిల్లాకు చెందిన 21 ప్రాజెక్ట్ల పరిధిలోగల కిశోర బాలికలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్వాడి సూపర్ వైజర్లు అవగాహన సదస్సును నిర్వహించి పౌష్టికాహారలోపం, కిశోర బాలికల సమస్యలు, బాల్యవివాహాలు సంబందిత చట్టాలపై సదస్సులో అవగాహన కల్పించనన్నట్లు తెలిపారు. సదస్సును జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సదస్సులో పాల్గొననున్నట్లు స్వరూపరాణి తెలిపారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు