విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. స్వరూపరాణి తెలిపారు. గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం అవగాహనపై జిల్లాస్థాయి సదస్సును నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ప్రతి మండలంలోను మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలతో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు, కళాజాతాల ద్వారా విస్త్రత ప్రచారం చేపట్టామన్నారు. జిల్లాకు చెందిన 21 ప్రాజెక్ట్ల పరిధిలోగల కిశోర బాలికలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్వాడి సూపర్ వైజర్లు అవగాహన సదస్సును నిర్వహించి పౌష్టికాహారలోపం, కిశోర బాలికల సమస్యలు, బాల్యవివాహాలు సంబందిత చట్టాలపై సదస్సులో అవగాహన కల్పించనన్నట్లు తెలిపారు. సదస్సును జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సదస్సులో పాల్గొననున్నట్లు స్వరూపరాణి తెలిపారు.
తాజావార్తలు
- స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం..
- భారత్కు యూఏఈ అధ్యక్షుడు..
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- మరిన్ని వార్తలు



