15వ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చిత్రపటాలను అందజేత

జనం సాక్షి,వంగూర్:
మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిజెపి వంగూరు మండల శాఖ మరియు అచ్చంపేట నియోజకవర్గ నాయకులు భారత 15వ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చిత్రపటాలను కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో రాజు నాయక్ కు మరియు పోలీస్ స్టేషన్లో ఎస్సై కురుమూర్తికి మండల అధ్యక్షుడు కానాపురం భాస్కర్ మరియు అసెంబ్లీ కన్వీనర్ మక్తాల రేనయ్య ఆధ్వర్యంలో ద్రౌపతి ముర్ము చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు సతీష్ మాదిగ, సీనియర్ నాయకులు మంగ్య నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లె భీమయ్య, మండల ప్రధాన కార్యదర్శి సిలువేరు సైదులు, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు సంతోష్ యాదవ్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ఓరె రాములు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Attachments area