15 రోజుల్లో ‘స్థానిక’ నోటిఫికేషన్ : జానా
హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి) :
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్టు మంత్రి జానారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ దఫా జరగనున్న ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తులపై జరగుతాయని ప్రకటించారు. ఇప్పటికే పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిందని, ఆయా జిల్లాల నుంచి నివేదికలు అందాల్సి ఉందని అన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అధిక స్థానాలు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వాయిదాపై వస్తున్నవి ఊహాగానాలేనని తెలిపారు.