18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి.
గరుడ యాప్ వినియోగం పై విస్తృత ప్రచారం కల్పించాలి.
ఓటరు నమోదు కార్యక్రమం పై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి.
గరుడ యాప్ వినియోగం పై బుత్ స్థాయి అధికారులకు శిక్షణ కల్పించాలి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి న్యూస్ జులై27:-
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా జాబితా రుపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్ వినియోగం పై అన్ని జిల్లాల కలెక్టర్లతో అయన వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనే వారని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ పై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని అయన సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 24, 2022 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి నవంబర్9, 2022 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేయాలని, డిసెంబర్ 8, 2022 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను
స్వీకరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డిసెంబర్26, 2022 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి5, 2023 న తుది ఓటరు జాబితా రూపోందించాలని తెలిపారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యా ప్తంగా స్వీప్ కార్యక్రమాల ను పెద్ద ఎత్తున చేపట్టాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ ఫారం 6, ఫారం 7, ఫారం 6 బీ, ఫారం 8 నూతనంగా ప్రారంభించి, ఫారం 8ఏ రద్దు చేసిందని, ఫారం 6 లో నూతన ఓటర్ నమోదు మాత్రమే ఉంటుందని, ప్రతి బూత్ స్థాయి అధికారి వద్ద నూతన ఫారంలు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆగష్టు1,2022 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వద్ద నుంచి ఆధార్ వివరాలు సేకరించాలని, ఆధార్ వివరాలు అందించడం ఐచ్చికం మాత్రమేనని, ఓటర్ల ఆధార్ వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, ఎన్నికల పర్యవేక్షకులు వరలక్ష్మీ , జయచంద్ర, అన్వేష్ తదితరులున్నారు.
Attachments area