187కు పెరిగిన బంగ్లా మృతుల సంఖ్య

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎనిమిది అంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతి చెందిన వారి  సంఖ్య 187కు పెరిగింది. సుమారు 1500 మందిని సహయ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకు పోయివుండొచ్చని భావిస్తున్నారు. ఢాకా శివార్లలోని  సవర్‌ ప్రాంతంలో వస్త్రకర్మాగారాలున్న ఓ వాణిజ్య సముదాయం బుధవారం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో భవనంలో 6,000 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది.